అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Railway Station | నగరంలోని రైల్వేస్టేషన్లో పార్కింగ్ దోపిడీ యథేచ్చగా సాగుతోంది. స్టేషన్ ప్రాంగణంలో పార్కింగ్ కాంట్రాక్టర్ (Parking contractor) తీసుకున్న వ్యక్తులు వాహనదారుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
వాహనాలను పార్కింగ్షెడ్లో ఉంచినందుకు ఇష్టారాజ్యంగా లెక్కలు వెస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని వారంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి ఈనెల 15వ తేదీన హైదరాబాద్(Hyderabad) వెళ్తూ తన బైక్ను రైల్వేస్టేషన్ పార్కింగ్ షెడ్లో ఉంచాడు. అతడు తిరిగి గురువారం తిరిగొచ్చి బైక్ కోసం వెళ్లగా పదిరోజులు షెడ్లో ఉంచినందుకు కాగాను రూ.782 ముక్కుపిండి వసూలు చేశారు. పైగా తాము ఇంతేనని ఎవరినీ వదిలిపెట్టమని మాట్లాడాడని బాధితులు వాపోతున్నారు. నామమాత్రపు ఛార్జీలు వేస్తే ఏమికాదని.. ఇలా వందల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడం ఏమిటని పలువురు వాహనదారులు పేర్కొంటున్నారు.