అక్షరటుడే, కోటగిరి: ఇంటి ఎదుట పార్క్ చేసిన బైక్ను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసిన ఘటన కోటగిరి (Kotagiri)మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో నివసించే పోతురాజు శ్రీనివాస్ నాలుగు నెలల క్రితం హోండాషైన్ (Honda Shine Bike) వాహనం కొన్నాడు. ఎప్పటిలాగే గురువారం తన ఇంటి ఎదుట బైక్ను పార్క్ చేసి ఉంచాడు. తెల్లవారుజామున బైక్ తగలబడుతున్న విషయాన్ని పక్కింటివాళ్లు గమనించి శ్రీనివాస్కు తెలియజేశారు. వెంటనే మంటలను ఆర్పినప్పటికీ అప్పటికే బైక్ పూర్తిగా తగలబడి పోయింది.
