Homeజిల్లాలునిజామాబాద్​Local Body Elections | పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు..

Local Body Elections | పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు..

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏకగ్రీవాల జోరు సాగుతోంది. బోధన్​, సాలూర, రెంజల్​ మండలాల్లో బుధవారం పలు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

- Advertisement -

అక్షరటుడే, బోధన్​: Local Body Elections | పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏకగ్రీవాల జోరు సాగుతోంది. బోధన్ (Bodhan)​, సాలూర, రెంజల్​ మండలాల్లో బుధవారం పలు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

Local Body Elections | నామినేషన్ల ఉపసంహరణ కావడంతో..

నామినేషన్ ఉపసంహరణకు బుధవారం చివరి రోజు కావడంతో గ్రామాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బోధన్ మండలంలోని నాలుగు గ్రామ పంచాయతీలలో సర్పంచ్ స్థానాలు (Sarpanch posts), వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మావంది కలాన్​లో సర్పంచ్​ స్థానానికి శకుంతల, పెంటాకుర్థు క్యాంప్​లో వేములపల్లి రాధిక, పెంటాకలాన్​లో కర్లం కళావతి, భూలక్ష్మీ క్యాంప్​లో కామిరెడ్డి బాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అలాగే సాలూర మండలంలో (Saloora mandal) మూడు గ్రామాలు సైతం ఏకగ్రీవం చేశారు. సాలంపాడ్​లో సర్పంచ్​ స్థానానికి శీలం నర్మద, ఫతేపూర్​లో షేక్ నూరా హైమద్, సాలూర క్యాంప్ సర్పంచ్​గా దొండేటి విజయభాస్కర్ రెడ్డి ఎన్నికయ్యారు. అదేవిధంగా రెంజల్ మండలంలోని దండిగుట్ట గ్రామంలో ధనుంజయ్​ను ఎన్నుకున్నారు. పలు గ్రామాల్లో వార్డు మెంబర్లు సైతం ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు.

Must Read
Related News