Homeక్రీడలుPakistan Cricket | పాకిస్తాన్ సంచలన నిర్ణయం?.. యూఏఈతో క్రికెట్ మ్యాచ్ బాయ్​కాట్​

Pakistan Cricket | పాకిస్తాన్ సంచలన నిర్ణయం?.. యూఏఈతో క్రికెట్ మ్యాచ్ బాయ్​కాట్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan Cricket | పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్​లో (Asia Cup) భాగంగా బుధవారం యూఏఈతో జరగాల్సిన మ్యాచ్​ను బహిష్కరించాలని నిర్ణయించింది. ఇండియా, పాక్ మ్యాచ్ (India-Pakistan match) సందర్భంగా తలెత్తిన షేక్ హ్యాండ్ వివాదం నేపథ్యంలో మ్యాచ్ రిఫరీని తొలగించక పోవడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో (Dubai International Cricket Stadium) గ్రూప్ A మ్యాచ్​లో పాకిస్తాన్ జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్​తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు సూపర్-4కు చేరుకుంటారు. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, యూఏఈ క్రికెటర్లు స్టేడియానికి చేరుకున్నారు. కానీ పాక్ క్రికెటర్లు మాత్రం రాలేదు.

Pakistan Cricket | హోటల్లోనే క్రికెటర్లు..

పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆసియా కప్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే అవకాశం ఉన్న నేపథ్యంలో మ్యాచ్ ను బహిష్కరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. బుధవారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా, సాయంత్రం 6.30 గంటలైనా పాకిస్తాన్ క్రికెటర్లు హోటల్ నుంచి బయటకు రాలేదు. ఆటగాళ్లు ఎవరు బయటకు రావొద్దని, హోటల్ లోనే ఉండాలని పీసీబీ ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ సమయం దగ్గర పడినా ఆటగాళ్లు హోటల్ రూంల నుంచి బయటకు రాలేదు.

Pakistan Cricket | అందుకే బాయ్ కాట్..

ఇటీవల భారతదేశంతో జరిగిన హ్యాండ్​ షేక్​ వివాదం (handshake controversy) తర్వాత ఆసియా కప్​లో యూఏఈతో జరిగే చివరి గ్రూప్ ఆటను బహిష్కరించాలని పాకిస్తాన్ నిర్ణయించింది. భారతదేశంతో జరిగిన మ్యాచ్​లో హ్యాండ్​ షేక్​ వివాదానికి ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ కారణమని, ఆయనను తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసింది.

అయితే, ఆ విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చింది. యూఏఈతో జరుగనున్న మ్యాచ్​కు కూడా ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీగా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. జాతీయ జట్టును హోటల్లోనే ఉంచాలని, యూఏఈతో జరిగే మ్యాచ్ కోసం వేదికకు వెళ్లవద్దని పీసీబీ ఆదేశించింది. భారత్​తో పాటు ఐసీసీ తీరుకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Must Read
Related News