HomeUncategorizedOperation Sindoor | పాక్ దాడులకు తీవ్రమైన ప్రతిచర్య తప్పదు: కేంద్రం హెచ్చరిక

Operation Sindoor | పాక్ దాడులకు తీవ్రమైన ప్రతిచర్య తప్పదు: కేంద్రం హెచ్చరిక

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Operation Sindoor | పాకిస్తాన్ pakistan​ దాడులకు తీవ్రమైన ప్రతిచర్య తప్పదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. పాక్​పై వైమానిక దాడుల air strike on pak గురించి విదేశాంగ, రక్షణ శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్​ మిస్రీ vikram misri మాట్లాడుతూ.. పహల్గామ్​ ఉగ్రదాడికి pahalgam terror attack బదులు చెప్పడానికి భారత్​ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడి చేసిందన్నారు. అయితే పాక్​ సామాన్య పౌరులపై దాడులు చేస్తోందన్నారు. కుప్వారా, బారాముల్లా, పూంచ్​, రాజౌరీ సెక్టార్లలో సరిహద్దుల వెంట కాల్పులు జరుపుతోందని పేర్కొన్నారు. పాక్​ దాడుల్లో 16 మంది మృతి చెందారని చెప్పారు.

Operation Sindoor | పాక్​ దాడులను తిప్పికొట్టాం

భారత్​ అతిక్రమణలకు పాల్పడిందంటూ పాక్​ తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. పాక్​కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను ఐక్యరాజ్య సమితి UNOకి అందించామని మిస్రి చెప్పారు. పాకిస్తాన్​ భారత్​లోని పలు ప్రాంతాలను పాక్​ టార్గెట్​ చేసిందని చెప్పారు. ఉత్తర, పశ్చిమ భారత్​లోని 15 ప్రాంతాల్లో దాడులకు యత్నించిందన్నారు. జలంధర్​, లుధియానా, అవంతిపుర, భటిండ, జమ్మూ, భుజ్​, అమృత్​సర్​, ఛండీఘడ్​ తదితర ప్రాంతాల్లో దాడికి యత్నించిందని వివరించారు. అయితే భారత్​ పాక్​ దాడులను తిప్పికొట్టిందన్నారు. పాక్​ మిస్సైళ్లను కూల్చేశామన్నారు. ఆ క్షిపణుల శకలాలు పాకిస్తాన్​ సైన్యానికి చెందినవిగా తేలిందన్నారు.

Operation Sindoor | ఎయిర్​ డిఫెన్స్​ వ్యవస్థను ధ్వంసం చేశాం

భారత్​పై పాక్​ దాడులు చేపటడ్డంతో లాహోర్​లోని ఎయిర్​ డిఫెన్స్​ సిస్టం pak air defence system ను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. పహల్​గామ్​ దాడితో పాకిస్తాన్​ మొదటి తప్పు చేసిందని చెప్పారు. టీఆర్​ఎఫ్​ TRF పేరును రిజల్యూషన్​లో పెడితే తొలగించాలని పాక్​ పట్టుబట్టిందన్నారు. ఐక్యరాజ్యసమితి టీఆర్​ఎఫ్​ను నిషేధించాలని చూస్తే పాక్​ అడ్డుకుందన్నారు.

టీఆర్​ఎఫ్​ అనేది లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అని పేర్కొన్నారు. తాము చేసిన దాడులు ఎక్కడా రెచ్చగొట్టేలా లేవన్నారు. చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో సైనిక అధికారులు పాల్గొన్నారని మిస్రీ పేర్కొన్నారు. మోస్ట్​ వాంటెడ్​ ఉగ్రవాదులు ఆశ్రయం పొందింది పాకిస్తాన్​లోనేనన్నారు. ఒసామా బిన్​ లాడెన్​కు ఆశ్రయం ఇచ్చింది పాకిస్తానేనని గుర్తు చేశారు. ​మసూద్​ అజార్​ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. పాక్​కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను ఐక్యరాజ్యసమితికి అందించామని చెప్పారు.

Must Read
Related News