HomeUncategorizedOperation Sindoor | పాక్ రక్షణ వ్యవస్థపై ఆ దేశ పౌరుడి ఆగ్రహం

Operation Sindoor | పాక్ రక్షణ వ్యవస్థపై ఆ దేశ పౌరుడి ఆగ్రహం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | పాక్​ రక్షణ pak defence శాఖపై ఆ దేశ పౌరులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పహల్గామ్​ ఉగ్రదాడికి pahalgam terror attack ప్రతీకారంగా భారత్​ పీవోకేతో పాటు పాక్​లోని 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. భారత్​ దాడులపై ఆ దేశ పౌరుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ మిసైల్స్ దాడి చేస్తే పాక్ అడ్డుకోలేకపోయిందని ఆ యువకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేగాకుండా పాత వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ దాడి చేసిందని, పాక్​లోని ఇతర ప్రాంతాల్లో దాడి చేసినా రక్షణ వ్యవస్థ చేసేదేమి లేదన్నారు. ఇజ్రాయెల్​పై ఎవరైన క్షిపణులు ప్రయోగిస్తే ఆ దేశ రక్షణ వ్యవస్థ వాటిలో ఎక్కువ మట్టుకు కూల్చి వేస్తుందన్నారు. కానీ పాక్​ మాత్రం ఒక్క క్షిపణిని కూడా అడ్డుకోలేకపోయిందన్నారు.

Must Read
Related News