ePaper
More
    HomeజాతీయంOperation Sindoor | మళ్లీ కాల్పులకు తెగబడుతున్న పాక్​

    Operation Sindoor | మళ్లీ కాల్పులకు తెగబడుతున్న పాక్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Sindoor |పాకిస్తాన్ pakistan​ తన బుద్ధి మార్చుకోవడం లేదు. నిన్న రాత్రి భారత్​పై దాడి చేసి విఫలమైన ఆ దేశం తాజాగా నియంత్రణ రేఖ LOC వెంబడి కాల్పులు జరుపుతోంది. గురువారం రాత్రి 400 డ్రోన్లతో పాక్​ భారత్​పై దాడి చేసిన విషయం తెలిసిందే. భారత బలగాలు వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి పాక్​ బలగాలు సరిహద్దు గ్రామాలపై కాల్పులు జరుపుతున్నాయి. పాక్​ కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతోంది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాల్లో ప్రజలు అధికారులు ఇప్పటికే అలర్ట్​ చేశారు. జైసల్మేర్​, యూరి ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. దీంతో అధికారులు బ్లాక్​ అవుట్​ ప్రకటించారు. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని సూచించారు. పాక్​ దాడులను భారత ఆర్మీ తిప్పి కొడుతోంది.

    More like this

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...

    Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా...