HomeUncategorizedOperation Sindoor | మళ్లీ కాల్పులకు తెగబడుతున్న పాక్​

Operation Sindoor | మళ్లీ కాల్పులకు తెగబడుతున్న పాక్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Sindoor |పాకిస్తాన్ pakistan​ తన బుద్ధి మార్చుకోవడం లేదు. నిన్న రాత్రి భారత్​పై దాడి చేసి విఫలమైన ఆ దేశం తాజాగా నియంత్రణ రేఖ LOC వెంబడి కాల్పులు జరుపుతోంది. గురువారం రాత్రి 400 డ్రోన్లతో పాక్​ భారత్​పై దాడి చేసిన విషయం తెలిసిందే. భారత బలగాలు వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి పాక్​ బలగాలు సరిహద్దు గ్రామాలపై కాల్పులు జరుపుతున్నాయి. పాక్​ కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతోంది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాల్లో ప్రజలు అధికారులు ఇప్పటికే అలర్ట్​ చేశారు. జైసల్మేర్​, యూరి ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. దీంతో అధికారులు బ్లాక్​ అవుట్​ ప్రకటించారు. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని సూచించారు. పాక్​ దాడులను భారత ఆర్మీ తిప్పి కొడుతోంది.