ePaper
More
    HomeజాతీయంIndian Soldier | భారత జవాన్​ను అప్పగించిన పాక్​

    Indian Soldier | భారత జవాన్​ను అప్పగించిన పాక్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Indian Soldier | పాకిస్తాన్​(Pakistan) తన చేతిలో బంధీగా ఉన్న భారత జవాన్​ను అప్పగించింది. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్​లోని పర్యాటకులపై దాడి చేసి 26 మందిని చంపేసిన విషయం తెలిసిందే. పహల్గామ్​ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత భారత్​, పాకిస్తాన్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ క్రమంలో ఏప్రిల్​ 23న బీఎస్‌ఎఫ్‌ జవాన్‌(BSF Soldier) పూర్ణమ్‌ కుమార్‌ షా వాఘా బోర్డర్​ సమీపంలో పొరపాటున సరిహద్దు దాటారు. దీంతో పాక్​ రేంజర్లు ఆయనను పట్టుకున్నారు.పీకే షా విడుదల కోసం భారత్​, పాకిస్తాన్​ చర్చలు జరిపింది. దీంతో బుధవారం ఉదయం 10:30 గంటలకు పీకే షాను పాకిస్తాన్​ భారత్​కు అప్పగించింది. అమృత్​సర్​లోని అటారి బోర్డర్​ వద్ద మన జవాన్​ను పాక్​ అధికారులు అప్పగించారు. జవాన్​ అప్పగింత ప్రక్రియ ప్రొటోకాల్​ ప్రకారం శాంతియుతంగా సాగిందని బీఎస్​ఎఫ్(BSF)​ తెలిపింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...