అక్షరటుడే, వెబ్డెస్క్: Pak drones : పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. సీజ్ ఫైర్ నిబంధనలు ఉల్లంఘించి మరోసారి డ్రోన్ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. రాజస్థాన్లోని బర్మార్లో డ్రోన్లు కనిపించాయని అక్కడి జిల్లా యంత్రాంగం ట్వీట్ చేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశించింది. దీనికితోడు స్థానికంగా బ్లాక్ అవుట్ విధించింది. మరోవైపు కశ్మీర్లోనూ కాల్పుల ఉల్లంఘన జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
