అక్షరటుడే, ఆర్మూర్: Oxford School | పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలకు (Oxford School) చెందిన పలువురు విద్యార్థులు జాతీయ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. తమ పాఠశాలకు చెందిన 3వ తరగతి విద్యార్థి మంగళారపు ప్రణవ్ కుమార్, 5వ తరగతి విద్యార్థి పిడుగు శివ లు జాతీయ ఛాంపియన్షిప్కు ఎంపికయ్యారని తెలిపారు.
Oxford School | సైన్స్, ఇంగ్లిష్ ఛాంపియన్షిప్ పోటీలు..
ఈ నెల 18న హైదరాబాద్లోని (Hyderabad) కేఎల్ఎన్ ప్రసాద్ ఆడిటోరియంలో లీడ్ సంస్థ ఆధ్వర్యంలో పలురకాల ఛాంపియన్షిప్ పోటీలు జరుగునున్నట్లు ఆయన వివరించారు. నవంబర్ చివరివారంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయిలో పోటీల్లో ప్రతిభ చూపిన ఈ ఇద్దరు విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారని పేర్కొన్నారు. మంగళారపు ప్రణవ్ కుమార్ జాతీయ సైన్స్ ఛాంపియన్షిప్కు, పిడుగు శివ జాతీయ ఇంగ్లిష్ ఛాంపియన్షిప్కు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్, అడ్మినిస్ట్రేటర్ పద్మ, అకడమిక్ కోఆర్డినేటర్ జ్యోతి ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మానస గణేష్ మాట్లాడుతూ..విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, రాబోయే పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి విజయం సాధించాలని ఆకాంక్షించారు.