Homeజిల్లాలుకామారెడ్డిKamareddy SP | 15 రోజుల్లో 164 సెల్​ఫోన్ల రికవరీ: ఎస్పీ రాజేష్​ చంద్ర

Kamareddy SP | 15 రోజుల్లో 164 సెల్​ఫోన్ల రికవరీ: ఎస్పీ రాజేష్​ చంద్ర

బాధితులు పోగొట్టుకున్న ఫోన్ల రికవరీలో కామారెడ్డి పోలీసులు ముందంజలో ఉన్నారని ఎస్పీ రాజేష్​చంద్ర అన్నారు. రికవరీ చేసిన ఫోన్లను గురువారం బాధితులకు అప్పగించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | జిల్లాలో ప్రతినెలా 150కి పైగా పోగొట్టుకున్న మొబైళ్లను రికవరీ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. గత 15 రోజుల్లో 164 మొబైళ్లను రికవరీ చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యావసరంగా మారిందన్నారు. అందులో వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్స్​, సోషల్ మీడియా అకౌంట్లు, వ్యక్తిగత ఫొటోలు వంటి కీలకమైన డేటా ఉంటుందని తెలిపారు.

మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నవారు కేవలం పరికరాన్ని మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారాన్ని, ఆర్థిక భద్రతను కూడా కోల్పోతున్నారన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. సీఈఐఆర్ పోర్టల్​ (CEIR Portel) ద్వారా ఫోన్‌ను సులభంగా గుర్తించవచ్చని వివరించారు.

ఈ ఏడాది ఎనిమిదో దఫాగా గత 15 రోజుల్లో ఈ బృందం 164 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని ఎస్పీ వివరించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం 2.53 కోట్ల విలువ చేసే 1,579 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. పోర్టల్ ప్రారంభం నుండి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం రూ. 6.45 కోట్ల విలువ చేసే 4,026 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్ల వివరాలు బాధితులకు తెలియజేస్తామని.. బాధితులు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి ఆర్ఎస్సై బాలరాజును (8712686114) సంప్రదించాలన్నారు. సంబంధిత వివరాలు చూపించి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లవచ్చని చెప్పారు.