HomeతెలంగాణOperation Sindoor | భారత్​ వైపు కన్నెత్తి చూస్తే నూకలు చెల్లినట్లే : సీఎం రేవంత్​

Operation Sindoor | భారత్​ వైపు కన్నెత్తి చూస్తే నూకలు చెల్లినట్లే : సీఎం రేవంత్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | ఉగ్రవాదులు భారత్​ వైపు కన్నెత్తి చూస్తే వారికి నూకలు చెల్లినట్లేనని సీఎం రేవంత్​రెడ్డి (CM revanth reddy) అన్నారు. పహల్గామ్​ ఉగ్రదాడికి (pahalgam terror attack) ప్రతీకారంగా భారత్​ చేపట్టిన ఆపరేషన్​ సిందూర్​కు (operation sindoor) సంఘీభావంగా గురువారం హైదరాబాద్​లో ర్యాలీ (rally on hyderabad) నిర్వహించారు. సెక్రటేరియట్ నుంచి ఇందిరా గాంధీ విగ్రహం (Secretariat to indira gandhi statue) వరకు ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ ​రెడ్డి (CM revanth reddy), మంత్రులు (ministers), ఉన్నతాధికారులు, మాజీ ఆర్మీ అధికారులు (former army officers)పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జవాన్లకు స్ఫూర్తి ఇవ్వడానికే ఈ ర్యాలీ అన్నారు. వీర జవాన్లకు అండగా నిలబడేందుకు వచ్చిన ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

Operation Sindoor | పాక్​ లేకుండా చేస్తాం..

భారత్​పై ఎవరైనా దాడి చేస్తే వదలబోమని సైన్యం చాటి చెప్పిందన్నారు. భారత్​ వైపు కన్నెత్తి చూస్తే నూకలు చెల్లినట్లేనని ఆయన అన్నారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు వీర సైనికులకు అండగా ఉంటారని సీఎం రేవంత్​రెడ్డి (CM revanth reddy) అన్నారు. రాజకీయాలు, పార్టీలకతీతంగా సైన్యానికి మద్దతుగా నిలవాలన్నారు. పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం ఇప్పించింది కూడా మహాత్మా గాంధీనే (Mahatma Gandhi gave independence to pakistan) అని సీఎం అన్నారు. ఆయన స్ఫూర్తితో భారత్​ శాంతి కాంక్షిస్తుంటే.. దానిని చేతకానితనంగా పాక్​ భావిస్తోందన్నారు. వారికి బుద్ధి చెప్పడానికి భారత్​ ఆపరేషన్​ సిందూర్​ (india launch operation sindoor) చేపట్టిందన్నారు. భారత సైన్యం (indian army) తలచుకుంటే రాత్రికి రాత్రే పాకిస్తాన్​ గల్లంతు అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. భారత్​పై దాడులు చేయాలని చూస్తే ప్రపంచ పటంలో నుంచి పాక్​ను మాయం చేస్తామన్నారు.

Must Read
Related News