HomeజాతీయంOperation Bluestar | ఆపరేషన్‌ బ్లూస్టార్‌ ఒక తప్పుడు నిర్ణయం.. కాంగ్రెస్​ నేత చిదంబరం సంచలన...

Operation Bluestar | ఆపరేషన్‌ బ్లూస్టార్‌ ఒక తప్పుడు నిర్ణయం.. కాంగ్రెస్​ నేత చిదంబరం సంచలన వ్యాఖ్యలు

Operation Bluestar | ఆపరేషన్​ బ్లూ స్టార్​ తప్పుడు నిర్ణయమని కాంగ్రెస్​ నేత చిదంబరం అన్నారు. ఈ నిర్ణయంతో ఇందిరా గాంధీ తన ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Bluestar | కాంగ్రెస్​ సీనియర్​ నేత పి చిదంబరం (P Chidambaram) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ (Indira Gandi) హయాంలో చేపట్టిన ఆపరేషన్​ బ్లూస్టార్​ తప్పుడు నిర్ణయమని ఆయన అన్నారు.

ఇందిరా గాంధీ హయాంలో పంజాబ్​లో సిక్కులు పవిత్రంగా భావించే స్వర్ణ దేవాలయంలో ఖలిస్తానీ వేర్పాటువాదులు దాక్కున్న విషయం తెలిసిందే. బింద్రాన్‌వాలే నేతృత్వంలోని వేర్పాటువాద ఉద్యమాన్ని అణిచివేయడానికి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 1984 జూన్ 1 మరియు జూన్ 8 మధ్య ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించారు.

భారత సైన్యం స్వర్ణ దేవాలయంలోకి వెళ్లి వేర్పాటు వాదులను హతమార్చింది. దీనిపై శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో చిదంబరం మాట్లాడారు. స్వర్ణదేవాలయంలో (Golden Temple) దాగిన ఖలిస్తానీ వేర్పాటువాదులను బయటకు రప్పించే మార్గం ఉందన్నారు. ఆపరేషన్‌ బ్లూస్టార్‌ ఒక తప్పుడు నిర్ణయమని అంగీకరించారు.

Operation Bluestar | సమష్టి నిర్ణయం

ఆపరేషన్​ బ్లూస్టార్​ ఇందిరాగాంధీ ఒక్కరే తీసుకున్న నిర్ణయం కాదని చిదంబరం పేర్కొన్నారు. ఆర్మీ, పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగాలు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమని తెలిపారు. అయితే ఆ తప్పుడు నిర్ణయానికి ఇందిరాగాంధీ ప్రాణాన్నే మూల్యంగా చెల్లించాల్సి వచ్చిందని ఆయన అన్నారు. తాము పవిత్రంగా భావించే స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్​ బ్లూ స్టార్​ నిర్వహించడంతో సిక్కులు ఆమెపై కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలో ఇందిరా గాంధీ అంగరక్షకులే ఆమెను హత్య చేశారు.

అనంతరం దేశంలో సిక్కులపై అనేక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు మూడు వేల మంది సిక్కులు చనిపోయినట్లు సమాచారం. దీనిపై అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) స్పందిస్తూ.. పెద్ద చెట్టు కూలిపోతే భూమి కంపిస్తుంది అని వ్యాఖ్యానించడం గమనార్హం.