అక్షరటుడే, కామారెడ్డి: Yashoda Hospitals | యశోద ఆస్పత్రి ఓపీ సేవలను జిల్లా కేంద్రంలో అందుబాటులోకి తీసుకొచ్చామని యశోద ఆస్పత్రి న్యూరో సర్జన్ బీజే రాజేష్ (BJ Rajesh, Neurosurgeon, Yashoda Hospital) తెలిపారు. గురువారం పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో యశోద మెడికల్ సెంటర్ను ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డా. రాజేష్ మాట్లాడుతూ.. బ్రెయిన్, హార్ట్ ఆపరేషన్స్, లివర్ మార్పిడి లాంటి చికిత్సల్లో యశోధ ఉత్తమ స్థానంలో ఉందన్నారు. ఆపరేషన్ థియేటర్లో ఎంట్రోపీ ఎమ్మారై (Entropy MRI) సమకూర్చిన ఏకైక ఆస్పత్రి యశోద అని పేర్కొన్నారు.
కామారెడ్డికి చెందిన ప్రశాంతి గర్భిణిగా ఉన్న సమయంలో మెదడులో నరాలు దెబ్బతిని ఇబ్బందులు పడగా.. యశోదలో చికిత్స అందించామన్నారు. అలాంటి పేషెంట్లు ప్రతిసారి హైదరాబాద్కు రావాలంటే.. ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కామారెడ్డిలో యశోద మెడికల్ సెంటర్ను ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందిన ప్రశాంతి, జనరల్ మేనేజర్ దేవేందర్, మేనేజర్ అనిల్ కుమార్, పీఆర్వో శ్రీనివాస్ పాల్గొన్నారు.