Homeతాజావార్తలుJubilee Hills | కొనసాగుతున్న ఉప ఎన్నిక పోలింగ్​.. నాన్​లోకల్స్​ ఉండడంపై సీఈవో ఆగ్రహం

Jubilee Hills | కొనసాగుతున్న ఉప ఎన్నిక పోలింగ్​.. నాన్​లోకల్స్​ ఉండడంపై సీఈవో ఆగ్రహం

జూబ్లీహిల్స్​లో పోలింగ్​ కొనసాగుతోంది. నియోజకవర్గంలో స్థానికేతరులు ఉండడంపై కేసులు నమోదు చేస్తున్నట్లు సీఈవో సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jubilee Hills | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 21 శాతం పోలింగ్​ నమోదైంది. అయితే నియోజకవర్గం పరిధిలో స్థానికేతరులు ఉండడంపై రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి (Election Officer Sudarshan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.

నియోజకవర్గంలోని నాన్‌లోకల్స్‌పై కేసులు నమోదు చేయాలని సీఈవో ఆదేశాలు జారీ చేశారు. మాక్‌ పోలింగ్‌లో ఈవీఎంలు మొరాయించాయన్నారు. 9 చోట్ల ఈవీఎంలను మార్చినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు నాన్‌ లోకల్స్‌పై 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికలు జరిగే ప్రాంతంలో ప్రచారం ముగిసిన తర్వాత స్థానికేతరులు ఉండడానికి వీలు లేదు. అయితే కొన్ని పార్టీల నాయకులు నియోజకవర్గంలో తిష్టవేశారు. పోలింగ్​ బూత్​ల వద్ద హడావుడి చేశారు. దీంతో సీఈవో చర్యలు చేపట్టారు.

Jubilee Hills | మంచి స్పందన

ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్​ (Naveen Yadav) తెలిపారు. బీఆర్ఎస్ (BRS) ఇప్పుడు కూడా కొంత తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. యువత బయటకు రావడం లేదన్నది అవాస్తవం అన్నారు. ఓటర్ల నుంచి తమకు మంచి స్పందన లభిస్తోందని చెప్పారు.

Jubilee Hills | వారికి మద్దతుగా పోలీసులు

బీఆర్​ఎస్​ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) మాట్లాడుతూ.. కాంగ్రెస్​ నాయకులకు పోలీసులు సపోర్టు చేస్తున్నారని ఆరోపించారు. బోరబండలో సీఐ కూడా కాంగ్రెస్ నాయకులకు మద్దతు ఇస్తున్నారన్నారు. తాము పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తుంటే వీడియోలు తీస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

Jubilee Hills | ఓటు వేయాలి

ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని బీజేపీ అభ్యర్థి దీపక్​రెడ్డి కోరారు. సోమవారం రాత్రి బీజేపీ యువ మోర్చా నేతలపై కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) దాడి చేశారన్నారు. అన్నీ ఆలోచించి ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు.

Must Read
Related News