అక్షరటుడే, బోధన్: Badi Bata | సకల సౌకర్యాలు ఉన్న సర్కారు బడుల్లోనే విద్యార్థులను చేర్చాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు సూచించారు. బడిబాటలో భాగంగా వారు ఆయా గ్రామాల్లో తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పిస్తున్నారు. శనివారం బోధన్ (Bodhan) మండలం బెల్లాల్ (Beloli) గ్రామంలో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి ఇద్దరు బాలురను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. కార్యక్రమంలో హెచ్ఎం చంద్రకళ, ఉపాధ్యాయులు గీత, సంగీత తదితరులు పాల్గొన్నారు.
