Homeజిల్లాలుకామారెడ్డిGandhari mandal | ఆగి ఉన్న ట్రక్‌ను ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

Gandhari mandal | ఆగి ఉన్న ట్రక్‌ను ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

ఆగిఉన్న ట్రక్​ను ఢీకొని ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన గాంధారి మండలంలోని ధర్మకాంట వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

- Advertisement -

అక్షర టుడే, గాంధారి: Gandhari mandal | ఆగి ఉన్న ట్రక్‌ను ఢీకొని ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన గాంధారి మండలంలో (Gandhari mandal) మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

స్థానికుల కథనం ప్రకారం.. నేరల్‌ గ్రామానికి చెందిన సంతోష్‌ గాంధారి వైపు బైక్‌పై వస్తున్నాడు. అయితే గాంధారిలోని ధర్మ కాంటా వద్ద ఓ ట్రక్​ ఆగి ఉంది. సంతోష్​ వెనక నుంచి ఆ ట్రన్​ను ఢీకొన్నాడు. దీంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు.