అక్షరటుడే, మెండోరా : Person missing in Godavari | గోదావరి నది (Godavari river) లో ఒకరు missing గల్లంతయ్యారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలో చోటుచేసుకుంది.
ఆర్మూర్ మండలం చేపూరు గ్రామానికి చెందిన కనికారపు గంగన్న(35) శనివారం (అక్టోబరు 11) మధ్యాహ్నం (తేదీ 11.10.2025) సమయంలో చాకిర్యాల్ సమీపంలోని గోదావరిలో గల్లంతయ్యారు.
Person missing in Godavari | ఒకరిని వెతకబోతూ..
నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న తన బావమరిదిని బంధువులతో కలిసి వెతుకుతూ గల్లంతయ్యారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు investigation చేస్తున్నట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు.