Homeజిల్లాలునిజామాబాద్​Drunk Drive | డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీల్లో పట్టుబడిన ఒకరికి ఏడు రోజుల జైలు

Drunk Drive | డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీల్లో పట్టుబడిన ఒకరికి ఏడు రోజుల జైలు

మద్యం తాగి వాహనం నడిపిన ఓ వ్యక్తికి నిజామాబాద్​ కోర్టు ఏడు రోజుల జైలుశిక్ష విధించింది. ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది.

- Advertisement -

అక్షరటుడే, ధర్పల్లి : Drunk Drive | మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి నిజామాబాద్​ (Nizamabad Court) న్యాయస్థానం జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ధర్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలో డ్రంకన్​ డ్రైవ్​ (Drunk Drive) తనిఖీలు చేస్తుండగా.. సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన విజయ్​కుమార్​ మద్యం సేవించి బైక్​ నడుపుతూ పోలీసులకు చిక్కాడు.

దీంతో పోలీసులు అతడికి కౌన్సెలింగ్​ నిర్వహించి శుక్రవారం నిజామాబాద్​​లో సెకండ్​ క్లాస్ మెజిస్ట్రేట్​ (Second Class Magistrate) నూర్జహాన్​ ఎదుట హాజరుపర్చారు. విచారించిన న్యాయమూర్తి అతడికి ఏడు రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా ధర్పల్లి పోలీసులు (Dharpalli Police) మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపితే మోటార్​ వాహన సవరణ చట్టం ప్రకారం రూ.10వేల వరకు జరిమానా విధిస్తారని.. జైలుశిక్షతో పాటు డ్రైవింగ్​ లైసెన్స్​ రద్దయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Must Read
Related News