Homeజిల్లాలుకామారెడ్డిYellareddy mandal | నాగమడుగు వద్ద వరదలో ఒకరి గల్లంతు

Yellareddy mandal | నాగమడుగు వద్ద వరదలో ఒకరి గల్లంతు

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy mandal | కాజ్​వేపై వరదను అంచనా వేయకుండా దాటుతూ ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. నిజాంసాగర్​ ఎస్సై శివకుమార్​ (Nizamsagar SI Sivakumar) తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన చాకలి ప్రవీణ్​ అచ్చంపేటలోని బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో నాగమడుగు కాజ్​వేను (Nagamadugu causeway) దాటేందుకు ప్రయత్నించాడు.

వరద ఉధృతంగా ఉండగా గమనించకుండా ఆయన కాజ్​వేను దాటేందుకు ప్రయత్నించి ప్రవాహంలో గల్లంతయ్యాడు. ప్రవీణ్​కు భార్య సునీత, పదేళ్ల కూతురు, ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గల్లంతైన చాకలి ప్రవీణ్​ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ప్రవీణ్​ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.