More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy mandal | నాగమడుగు వద్ద వరదలో ఒకరి గల్లంతు

    Yellareddy mandal | నాగమడుగు వద్ద వరదలో ఒకరి గల్లంతు

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy mandal | కాజ్​వేపై వరదను అంచనా వేయకుండా దాటుతూ ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. నిజాంసాగర్​ ఎస్సై శివకుమార్​ (Nizamsagar SI Sivakumar) తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన చాకలి ప్రవీణ్​ అచ్చంపేటలోని బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో నాగమడుగు కాజ్​వేను (Nagamadugu causeway) దాటేందుకు ప్రయత్నించాడు.

    వరద ఉధృతంగా ఉండగా గమనించకుండా ఆయన కాజ్​వేను దాటేందుకు ప్రయత్నించి ప్రవాహంలో గల్లంతయ్యాడు. ప్రవీణ్​కు భార్య సునీత, పదేళ్ల కూతురు, ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గల్లంతైన చాకలి ప్రవీణ్​ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ప్రవీణ్​ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

    More like this

    APPSC : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పోస్టులు ఏవంటే..

    అక్షరటుడే, అమరావతి: APPSC : ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh లో నిరుద్యోగులకు APPSC శుభవార్త తెలిపింది. 21 ఉద్యోగాలకు...

    Nizamabad | భారీగా అల్ప్రాజోలం పట్టివేత

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నిజామాబాద్ నగర శివారులో నార్కోటిక్ బృందం అధికారులు మంగళవారం దాడులు...

    Bathukamma Young Filmmakers’ Challenge | యువ కంటెంట్ క్రియేటర్లకు ప‌ట్టం.. బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ – 2025 పేరిట షార్ట్ ఫిలిమ్స్ పోటీలు!

    అక్షరటుడే, హైదరాబాద్: Bathukamma Young Filmmakers’ Challenge | తెలంగాణ‌లోని యువ కంటెంట్ క్రియేటర్లకు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్...