Homeక్రైంHyderabad | మటన్​ తిని ఒకరి మృతి.. ఏడుగురికి అస్వస్థత

Hyderabad | మటన్​ తిని ఒకరి మృతి.. ఏడుగురికి అస్వస్థత

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో విషాదం చోటు చేసుకుంది. మటన్​ (Mutton) తిని అస్వస్థతకు గురై ఒక్కరు మృతి చెందగా.. మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నగరంలోని వనస్థలిపురం పోలీస్​ స్టేషన్​ పరిధిలోని చింతల్​కుంటలో చోటు చేసుకుంది.

చింతల్​కుంట ఆర్టీసీ కాలనీలో శ్రీనివాస్​ యాదవ్​ (46) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన ఆర్టీసీ కండక్టర్​గా పని చేస్తున్నారు. కాగా ఆదివారం బోనాల (Bonalu Festival) సందర్భంగా శ్రీనివాస్​ మటన్​, బోటీ, చికెన్​ తీసుకొచ్చాడు. పండుగ రోజు తిన్న తర్వాత మిగిలిన కర్రీలను ఫ్రిజ్​లో పెట్టారు. సోమవారం వాటిని వేడి చేసుకొని తిన్నారు. అయితే ఫుడ్​ పాయిజన్​ కావడంతో కుటుంబంలోని 8 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో వారు ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో జాయిన్​ అయ్యారు. అయితే పరిస్థితి విషమించి శ్రీనివాస్​ యాదవ్​ మంగళవారం మృతి చెందారు. మిగతా ఏడుగురు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.