Homeజిల్లాలునిజామాబాద్​Kammarpalli | దుస్తులకు బురద అంటుకుందని కాలువలో దిగాడు.. పట్టుతప్పి ప్రాణం పోయింది..

Kammarpalli | దుస్తులకు బురద అంటుకుందని కాలువలో దిగాడు.. పట్టుతప్పి ప్రాణం పోయింది..

Kammarpalli | దుస్తులకు అంటిన బురదను శుభ్రం చేసుకునేందుకు కాలువలోకి దిగిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డారు. కమ్మర్​పల్లి మండలంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | దుస్తులకు అంటుకున్న బురదను తొలగించుకునేందుకు వరద కాలవలోకి దిగిన ఓ వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన కమ్మర్​పల్లి(Kammarpalli) మండలంలో మంగళవారం చోటు చేసుకుంది.

కమ్మర్​పల్లి ఎస్సై అనిల్​రెడ్డి(SI Anil Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొమిరే రాజేందర్​ (47) నాగపూర్​కు వెళ్తుండగా.. దుస్తులకు బురద అంటుకుంది.దీంతో రోడ్డుపక్కనే ఉన్న వరద కాలువలోకి దిగి దుస్తులు శుభ్రం చేసుకుంటుండగా పట్టుతప్పి అందులో పడిపోయాడు. ఈతరాకపోవడంతో మృత్యువాత పడ్డాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆర్మూర్​ ప్రభుత్వ ఆస్పత్రి(Armoor Government Hospital)కి తరలించామని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.