Indalwai
Indalwai | అత్తింటి వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య

అక్షరటుడే, లింగంపేట: Lingampet | పురుగుల మందు సేవించి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన లింగంపేట మండలం అయ్యపల్లిలో చోటు చేసుకుంది. లింగంపేట్​ ఇన్​ఛార్జి ఎస్సై భార్గవ్​గౌడ్​ (SI Bhargav Goud) తెలిపిన వివరాల ప్రకారం.. అయ్యపల్లి (Ayyapally) తండాలో మూడు రోజుల క్రితం మేకల చోరీ జరిగింది. ఈ ఘటనలో కేసు నమోదు కాగా.. చల్ల మహేశ్​, కాంట్రపల్లి ప్రవీణ్​లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ​

అయితే ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు మరో ఇద్దరు కూడా మేకల చోరీకి పాల్పడ్డట్లుగా ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో సంబంధం లేని కేసులో తన పేరు రాసినందుకు అవమానంగా భావించిన అయ్యపల్లి గ్రామానికి చెందిన చిలుక లక్ష్మీనారాయణ (40) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దీంతో గ్రామస్థులు ఆగ్రహానికి గురై ఆదివారం పోలీస్​స్టేషన్​కు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో ఎల్లారెడ్డి సీఐ రాజిరెడ్డి పోలీస్​స్టేషన్​కు చేరుకొని వారిని సముదాయించారు. మృతుడి భార్య మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పత్రిక విలేకరి, మహేష్, ప్రవీణ్​​లపై కేసు నమోదు చేసినట్లు ఇన్​ఛార్జి ఎస్సై వివరించారు.