ePaper
More
    HomeతెలంగాణGovernor Jishnu Dev Varma | గవర్నర్​కు స్వాగతం పలికిన అధికారులు

    Governor Jishnu Dev Varma | గవర్నర్​కు స్వాగతం పలికిన అధికారులు

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి: Governor Jishnu Dev Varma |జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు డిచ్​పల్లిలోని పోలీస్ బెటాలియన్ వద్ద ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి(Rajya Sabha member Suresh Reddy), కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy), పోలీస్ కమిషనర్ సాయి చైతన్య(CP Sai chaitanya), ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ(Battalion Commandant Satyanarayana), తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్​లర్​ ప్రొఫెసర్ యాదగిరి(TU Vice Chancellor Professor Yadagiri) తదితరులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

    Governor Jishnu Dev Varma | పోలీసుల నుంచి గౌరవ వందనం..

    ఈ సందర్భంగా గవర్నర్ కు పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన బెటాలియన్ గెస్ట్​హౌస్ ప్రాంగణంలో ఉన్నతాధికారులతో కలిసి మొక్కలు నాటారు. గవర్నర్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

    విద్యార్థినితో కరచాలనం చేస్తున్న గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ

    మొక్క నాటి మట్టి వేస్తున్న గరవ్నర్​ జిష్ణుదేవ్​ వర్మ

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...