Homeజిల్లాలునిజామాబాద్​Kammarpally | ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న అధికారులు.. తప్పించుకోబోయి బోల్తాపడ్డ ట్రాక్టర్​

Kammarpally | ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న అధికారులు.. తప్పించుకోబోయి బోల్తాపడ్డ ట్రాక్టర్​

ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్​ను అధికారులు అడ్డుకోగా వారిని తప్పించుకుని వెళ్తూ ట్రాక్టర్​ బోల్తా పడింది. ఈ ఘటన కమ్మర్​పల్లి మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, కమ్మర్​పల్లి: Kammarpally | ఇసుక అక్రమ రవాణాను (illegal sand transportation_ అధికారులు అడ్డుకోగా.. వారిని తప్పించుకుని వెళ్తూ ఓ ట్రాక్టర్​ బోల్తా పడింది. ఈ ఘటన కమ్మర్​పల్లి మండలంలో (Kammarpally mandal) సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై అనిల్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హాసాకొత్తూరు – కమ్మర్​పల్లి రహదారిలో (Hasakotturu-Kammarpally road) ట్రాక్టర్​తో ఓ వ్యక్తి ఇసుకను తరలిస్తున్నాడు.

అయితే విధుల్లో భాగంగా హాసాకొత్తూర్​ వీఆర్​ఏ ​ఈ ట్రాక్టర్​ను వెంబడించి ఆపి ఎక్కడి నుంచి ఇసుకను తీసుకొస్తున్నావని డ్రైవర్​ సాయికుమార్​ను ప్రశ్నించారు. తాను భీమ్​గల్​ మండలంలోని కుప్కాల్​ గ్రామంలోని (Kupkal village) ఒర్రె నుంచి ఇసుకను తెస్తున్నానని డ్రైవర్​ పేర్కొన్నాడు. అయితే ఇలా అక్రమంగా ఇసుకను తీసుకురావడం చట్టవిరుద్దమని పేర్కొంటూ వీఆర్​వో ఆర్​ఐ శరత్​కు​ సమాచారం అందించాడు.

ఆర్​ఐ వెంటనే అక్కడికి చేరుకుని ట్రాక్టర్​ను పోలీస్​స్టేషన్​కు తరలించే ప్రయత్నం చేయగా ట్రాక్టర్​ డ్రైవర్​ వారిని తప్పించి వేగంగా ముందుకు వెళ్లాడు. అయితే కొద్దిదూరంలో అదుపుతప్పిన ట్రాక్టర్​ బోల్తా పడింది. డ్రైవర్​కు ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాక్టర్​ యజమాని వేముల భాస్కర్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్​రెడ్డి పేర్కొన్నారు.

Must Read
Related News