HomeతెలంగాణSigachi Factory | సిగాచి పేలుడుపై అధికారుల కీలక ప్రకటన

Sigachi Factory | సిగాచి పేలుడుపై అధికారుల కీలక ప్రకటన

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sigachi Factory | సంగారెడ్డి జిల్లా(Sangareddy District) పాశమైలారంలో గల సిగాచి పరిశ్రమ(Sigachi Factory)లో ఇటీవల పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 44 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే 8 మంది కార్మికుల ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ క్రమంలో బుధవారం అధికారులు కీలక ప్రటన చేశారు. 8 మంది ఆచూకీ లభించడం అసాధ్యమని పేర్కొన్నారు.

Sigachi Factory | ఇంటికి వెళ్లిపోవాలని సూచన

వారం రోజుల క్రితం సిగాచి పరిశ్రమలో పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రమాదంలో మొత్తం ఇప్పటి వరకు 44 మంది చనిపోయారు. 16 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే 8 మంది కార్మికుల ఆచూకీ లభిచంలేదు. రాహుల్, శివాజి, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ ప్రమాదంలో కాలి బూడిదై ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఫ్యాక్టరీలో 100కిపైగా శాంపిల్స్ సేకరించినా వారి కుటుంబ సభ్యుల డీఎన్​ఏతో మ్యాచ్​ కాలేదు. దీంతో వీరు కాలిబూడిదై ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సంగారెడ్డి అదనపు కలెక్టర్​ చంద్రశేఖర్(Additional Collector Chandrashekhar) సమాచారం ఇచ్చారు. ఆ ఎనిమిది మంది కార్మికుల కుటుంబ సభ్యులు ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు. మూడు నెలల తర్వాత రావాలని సూచించారు.

Sigachi Factory | కొనసాగుతున్న విచారణ

సిగాచి పేలుడుకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కంపెనీలో కొత్త పరికరాలు కొనుగోలు చేయకపోవడంతో పేలుడు సంభవించినట్లు సమాచారం. ఇప్పటికే కంపెనీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది.

ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడంతో పాటు భవిష్యత్​లో పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు నిపుణుల కమిటీ పరిశ్రమను పరిశీలించి వివరాలు సేకరించింది. మరోవైపు నేషనల్​ డిజాస్టర్​ మేనేజ్​మెంట్ అథారిటీ అధికారులు సైతం మంగళవారం పరిశ్రమను సందర్శించారు. సేఫ్టీకి సంబంధించి పరిశ్రమలో ప్రమాణాలపై ఆరా తీశారు. అనంతరం పరిశ్రమ యాజమాన్యాన్ని అధికారులు ప్రశ్నించారు. ఈ మేరకు నివేదిక సిద్ధం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనున్నారు.