Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | ప్రైవేట్​ బస్సులను తనిఖీ చేసిన అధికారులు

Bodhan | ప్రైవేట్​ బస్సులను తనిఖీ చేసిన అధికారులు

బోధన్​ పట్టణంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించిన ఓ స్కూల్​ బస్సుపై కేసు నమోదు చేశారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్: Bodhan | నిబంధనలను పాటించని ట్రావెల్స్, స్కూల్​​ బస్సులపై ఆర్టీఏ అధికారులు (RTA officials) కొరడా ఝలిపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటన నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా బోధన్ పట్టణంలో (Bodhan town) ఎంవీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడులు చేశారు.

Bodhan | నిబంధనలు పాటించకపోతే..

నిబంధనలు పాటించని ఓ స్కూల్​ బస్సుపై (school bus) కేసు నమోదు చేసినట్లు ఎంవీఐ శ్రీనివాస్​ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రావెల్స్​, స్కూల్​ బస్సులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. లేకపోతే తనిఖీల్లో భాగంగా జరిమానాలు విధిస్తామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయనతో పాటు టౌన్​సీఐ వెంకట నారాయణ (Town CI Venkata Narayana) తనిఖీల్లో పాల్గొన్నారు.