అక్షరటుడే, నిజామాబాద్ సిటీ:Nizamabad City | జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో గల మనోరమ ఆస్పత్రి(Manorama Hospital)లో పనిచేస్తున్న నర్సు శనివారం ఉదయం మృతి చెందింది. కామారెడ్డి జిల్లా డోంగ్లీకి చెందిన శిల్ప(27) ఏడేళ్లుగా మనోరమ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డు(Emergency Ward)లో విధులు నిర్వహిస్తోంది. డ్యూటీ చేసిన అనంతరం రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పి ఉదయం 6:30కు నిద్ర లేపాలని తోటి సిబ్బందికి చెప్పింది. ఉదయం 7.30 గంటల సమయంలో ఆమెను పలకరించగా ఎలాంటి చలనం లేకపోవడంతో డాక్టర్లకు సమాచారం అందించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. కూతురిని కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

More like this
సినిమా
Ghati Movie | ఘాటీ పరాజయం తర్వాత సోషల్ మీడియా నుండి విరామం తీసుకున్న అనుష్క శెట్టి .. స్వీటీ భావోద్వేగ పోస్ట్ వైరల్
అక్షరటుడే, వెబ్డెస్క్ : Ghati Movie | ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అనుష్క శెట్టి...
కామారెడ్డి
Kamareddy | కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సభ వాయిదా.. భారీ వర్షాల నేపథ్యంలో నిర్ణయం
అక్షరటుడే, వెబ్డెస్క్ : Kamareddy | కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించ...
నిజామాబాద్
Minister Vakiti Srihari | రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణం..
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Minister Vakiti Srihari | తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని...