అక్షరటుడే, కామారెడ్డి: NSUI Sandeep Challenge | ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు అన్యాక్రాంతం అయిన విషయంపై ఎమ్మెల్యే సవాల్కు తాము సిద్ధమని, సోమవారం కలెక్టరేట్కు ఏ సమయానికి చర్చకు రావాలో చెప్పాలని ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్ అన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఆదివారం ఎమ్మెల్యేకు బహిరంగ లేఖ విడుదల చేశారు.
NSUI Sandeep Challenge | ఆధారాలతో నిరూపిస్తాం
ప్రభుత్వ కాలేజీ భూముల్లో జరిగిన అక్రమాలపై సోమవారం కలెక్టరేట్ వద్ద ఆధారాలతో సహా వస్తానని ఎమ్మెల్యే తెలపడాన్ని ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం స్వాగతిస్తోందన్నారు. ప్రజా సమస్యలపై, విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న కాలేజీ భూముల విషయంలో తమ సంఘం ఎప్పుడూ రాజీలేని పోరాటం చేస్తూనే ఉందని తెలిపారు. ఎమ్మెల్యే విసిరిన సవాల్ను తాము స్వీకరిస్తున్నామని, చర్చకు రావడానికి మేము పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కళాశాల భూముల్లో జరిగిన అక్రమాలు, భూములు ఎలా అన్యాక్రాంతమయ్యాయో ప్రతి అంశాన్ని ఆధారాలతో సహా నిరూపించడానికి తమ వద్ద సాక్ష్యాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాకుండా, నిజాయితీగా అక్రమాలను వెలికితీసే ఉద్దేశం ఎమ్మెల్యేకు ఉంటే మాటకు కట్టుబడి చర్చకు రావాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆస్తులను కాపాడడంలో ఎన్ఎస్యూఐ ఎవరికీ భయపడదని, నిజానిజాలు ప్రజల ముందు, విద్యార్థుల ముందు తేలాల్సిందేనని స్పష్టం చేశారు.
