Homeజిల్లాలునిజామాబాద్​Togarla Suresh | 'పెందోట సాహిత్య పురస్కారం' అందుకున్న ప్రముఖ కవి తొగర్ల సురేశ్​

Togarla Suresh | ‘పెందోట సాహిత్య పురస్కారం’ అందుకున్న ప్రముఖ కవి తొగర్ల సురేశ్​

ప్రముఖ కవి తొగల సురేష్​ 'పెందోట సాహిత్య పురస్కారం' అందుకున్నారు. సిద్దిపేట ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీవాణి సాహిత్య పరిషత్​ ఆధ్వర్యంలో ఆయనకు పురస్కారానికి అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్ : Togarla Suresh | జిల్లాకు చెందిన ప్రముఖ కవి తొగల సురేష్​ ‘పెందోట సాహిత్య పురస్కారం’ అందుకున్నారు. సిద్దిపేటలో శ్రీవాణి సాహిత్య పరిషత్ (Srivani Sahitya Parishad) ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పుస్తకాల పోటీలో తొగర్ల సురేశ్ రాసిన ‘వెన్నెల్లో మా పల్లె‘ (Vennello Maa Palle) పుస్తకానికి లభించింది. ఈ వివరాలను కవి కంకణాల రాజేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

సిద్దిపేట (Siddipet)లోని ప్రెస్​క్లబ్​లో నిర్వాహకులు పెందోట వెంకటేశ్వర్లు, ప్రముఖ బాలసాహితీవేత్త గరిపెల్లి అశోక్,క్రియాశీల కార్యవర్గ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొగర్ల సురేశ్​ (Togarla Suresh)కు ఈ పురస్కారం, జ్ఞాపిక, సగదుతో సత్కరించారని ఆయన వివరించారు. ఈ సందర్భంగా తొగర్ల సురేశ్​ను ప్రముఖ కవులు తిరుమల శ్రీనివాస్ ఆర్య, కంకణాల రాజేశ్వర్, మద్దుకూరి సాయిబాబు, స్వర్ణ సమత, దారం గంగాధర్, డాక్టర్ బోచ్కర్ ఓం ప్రకాశ్, లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఛైర్మన్, ప్రముఖ సామాజిక సేవకుడు, విశ్రాంత హెచ్​ఎం చాకులింగం, సీనియర్ జర్నలిస్టు, బాల్కొండ చరిత్ర గ్రంథ రచయిత బ్రహ్మరౌతు నర్సింగ్ రావు తదితరులు అభినందించారు.

Must Read
Related News