Homeజిల్లాలుకామారెడ్డిJajala Surender | పరామర్శకు కాదు.. సీఎం విహారయాత్రకు వచ్చివెళ్లినట్లుంది.. మాజీ ఎమ్మెల్యే జాజాల

Jajala Surender | పరామర్శకు కాదు.. సీఎం విహారయాత్రకు వచ్చివెళ్లినట్లుంది.. మాజీ ఎమ్మెల్యే జాజాల

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Jajala Surender | ఎల్లారెడ్డి ప్రజలు, రైతులను పరామర్శించి ప్యాకేజీ ఇవ్వాల్సిన సీఎం.. విహారయాత్రకు వచ్చి వెళ్లినట్లుందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్​(Jajala Surender) ఎద్దేవా చేశారు.ఈమేరకు హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో(Telangana bhavan) శుక్రవారం ఆయన మాట్లాడారు.

లింగంపేట(Lingampet)లో కేవలం చిన్నవంతెనకు ఇరువైపులా రోడ్డు కొట్టుకుపోతే ఆ రోడ్డును చూసేందుకు హైదరాబాద్​ నుంచి వచ్చారని.. వేల ఎకరాల్లో పంటనష్టం కనిపించలేదా.. అని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. నాగిరెడ్డిపేటలో 5వేల మంది రైతులు.. రాజంపేటలో 4 వేలు మంది, ఎల్లారెడ్డి 3వేల మంది రైతులు నష్టపోయారన్నారు. కేవలం ఫొటో ఎగ్జిబిషన్ చూసి సీఎం కామారెడ్డి వెళ్లిపోయారని..ఎల్లారెడ్డి రైతులంటే అంత చులకననా అని జాజాల ప్రశ్నించారు.

Jajala Surender | సత్వర న్యాయం కావాలి..

బీఆర్​ఎస్​ హయాంలో వరద నష్టం జరిగితే ఆయా ప్రాంతాలను కేసీఆర్​ సందర్శించి తక్షణమే నష్టపరిహారం అందజేసేవారన్నారు. కానీ ​ సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) మాత్రం సమీక్షిస్తాం.. చూస్తాం.. చేస్తాం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సత్వరం సాయం చేయాలని డిమాండ్​ చేశారు. 19,530 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. పంటపొలాల్లో ఇసుక మేటలు వేసిందని.. పెద్ద పెద్ద రాళ్లు పొలాల్లోకి వచ్చాయని.. రైతు తిరిగి సాగు ఎలా చేస్తారని ప్రశ్నించారు. తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్​ చేశారు

Must Read
Related News