ePaper
More
    HomeజాతీయంBandi Sanjay | బండి సంజయ్​పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

    Bandi Sanjay | బండి సంజయ్​పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Bandi Sanjay | భాజపా సీనియర్​ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar)కు షాక్ తగిలింది. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ (Non-bailable warrant) జారీ అయింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్​లో ఉన్న నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు(Nampally Court) దీనిని జారీ చేసింది.

    Bandi Sanjay : వారెంట్ ఎందుకంటే..

    హుజురాబాద్​లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కోడ్​ ఉల్లంఘించారనే కేసులో కోర్టు ఈ చర్యలకు ఉపక్రమించింది. ఈ కేసు విషయంలో హాజరుకావాలని కోర్టు చాలాసార్లు బండి సంజయ్​కు నోటీసులు పంపింది. కానీ, ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు సీరియస్​ అయింది. తదుపరి చర్యలో భాగంగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది.

    Bandi Sanjay : పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో..

    ప్రస్తుతం పార్లమెంట్ Parliament​ వర్షాకాల monsoon session సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్​ ఢిల్లీలో ఉన్నారు. ఇదే సమయంలో కోర్టు వారెంట్​ జారీ చేసింది. ఈ క్రమంలో కాస్త సమయం కోరుతూ ఆయన తరఫున న్యాయవాది కోర్టులో పిటిషన్​ దాఖలు చేసే అవకాశం ఉంది.

    More like this

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....

    CMRF Checks | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Checks | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి(Ramchandrapalli Village) చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న...

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...