HomeతెలంగాణBandi Sanjay | బండి సంజయ్​పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

Bandi Sanjay | బండి సంజయ్​పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Bandi Sanjay | భాజపా సీనియర్​ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar)కు షాక్ తగిలింది. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ (Non-bailable warrant) జారీ అయింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్​లో ఉన్న నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు(Nampally Court) దీనిని జారీ చేసింది.

Bandi Sanjay : వారెంట్ ఎందుకంటే..

హుజురాబాద్​లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కోడ్​ ఉల్లంఘించారనే కేసులో కోర్టు ఈ చర్యలకు ఉపక్రమించింది. ఈ కేసు విషయంలో హాజరుకావాలని కోర్టు చాలాసార్లు బండి సంజయ్​కు నోటీసులు పంపింది. కానీ, ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు సీరియస్​ అయింది. తదుపరి చర్యలో భాగంగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది.

Bandi Sanjay : పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో..

ప్రస్తుతం పార్లమెంట్ Parliament​ వర్షాకాల monsoon session సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్​ ఢిల్లీలో ఉన్నారు. ఇదే సమయంలో కోర్టు వారెంట్​ జారీ చేసింది. ఈ క్రమంలో కాస్త సమయం కోరుతూ ఆయన తరఫున న్యాయవాది కోర్టులో పిటిషన్​ దాఖలు చేసే అవకాశం ఉంది.

Must Read
Related News