Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar Project | రేపు నిజాంసాగర్​ గేట్లు ఎత్తే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

Nizamsagar Project | రేపు నిజాంసాగర్​ గేట్లు ఎత్తే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. 50వేల క్యూసెక్కులకు పైగా ఇన్​ఫ్లో ప్రాజెక్టులోకి వస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఉండడంతో అధికారులు మంజీర పరీవాహక ప్రాంతంలో ఉండే ప్రజలను అలర్ట్ చేస్తున్నారు.

Nizamsagar Project | ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం..

రాబోయే 24 గంటల్లో నిజాంసాగర్​ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని.. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయని తహశీల్దార్​ భిక్షపతి (Tahsildar Bikshapathi), నీటిపారుదల శాఖ (Irrigation Department) ఏఈలు అక్షయ్ కుమార్, సాకేత్​లు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ప్రాజెక్టుకు వస్తున్న ఇన్​ఫ్లో చూసిన అనంతరం వారు వివరాలు వెల్లడించారు.

Nizamsagar Project | జాలర్లు, గొర్రెల కాపర్లకు అలర్ట్​..

ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున మంజీర (manjeera) పరీవాహక ప్రాంతంలో చేపలు పట్టేవాళ్లు, గొర్రెల కాపర్లు అలర్ట్​గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నీటి ఉధృతి ఉంటుంది. కావున పరీవాహక ప్రాంతాలవైపు వెళ్లవద్దని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.8 టీఎంసీలకు గాను 10.79 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సింగూరుకు భారీగా వరద నీరు వస్తుండడంతో నిజాంసాగర్​ నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.

Must Read
Related News