అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్ట్కు వరద కొనసాగుతోంది. జలాశయంలోకి ఎగువ నుంచి 65,324 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది.
సింగూరు, పోచారం ప్రాజెక్ట్ల (Pocharam projects) నుంచి వరద వస్తుండటంతో నిజాంసాగర్లోకి ఇన్ఫ్లో కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం (full water capacity) 17.802 (1405 అడుగులు) టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 16.417 (1404.04) అడుగుల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో గేట్లు ఎత్తి 59,648 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆయకట్టు కోసం ప్రధాన కాలువకు వెయ్యి క్యూసెక్కులు వదులుతున్నారు.