ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar project | కళ తప్పిన నిజాంసాగర్​.. తగ్గిపోతున్న పర్యాటకుల సంఖ్య

    Nizamsagar project | కళ తప్పిన నిజాంసాగర్​.. తగ్గిపోతున్న పర్యాటకుల సంఖ్య

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar project | వందేళ్ల చరిత్ర గల నిజాంసాగర్​ ప్రాజెక్ట్​పై (nizamsagar project) పట్టింపు కరువైంది. ఒకప్పుడు పర్యాటకులకు (tourists)ఆహ్లాదాన్ని పంచిన ప్రాజెక్ట్​ అందాలు.. ఇప్పుడు కనమరుగవుతున్నాయి. వేసవి వచ్చిందంటే పర్యాటకుల రద్దీగా ఉండే జలాశయం పరిసరాలు ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తున్నాయి.

    నిజాం హయాంలో మంజీర నదిపై (majeera river) నిజాంసాగర్ మండలం అచ్చంపేట– బంజేపల్లి గ్రామాల (achampet-bajempally villages) పరిధిలో 1923-31 మధ్యకాలంలో నిర్మించారు. ప్రధాన ఇంజినీర్​ నవాబ్ ఆలీ​ జంగ్​ బహదూర్​ పర్యవేక్షణలో ప్రాజెక్ట్​ నిర్మాణం పూర్తి చేశారు. 1405 అడుగుల ఎత్తు, 30 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించారు. ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో (joint nizamabad district) 2.70 లక్షల ఎకరాలకు ఈ జలాశయం ద్వారా సాగునీరు అందుతోంది. అయితే ప్రాజెక్ట్​ నిర్మాణ (project construction) సమయంలోనే ప్రజల ఆహ్లాదం కోసం పలు నిర్మాణాలు చేపట్టారు. వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుతున్నాయి.

    Nizamsagar project | నిర్వహణ లేకపోవడంతో..

    ప్రాజెక్ట్ వద్ద సమ్మర్​ బాగ్​, స్మిమ్మింగ్​పూల్​, గోల్​ బంగ్లా నిర్మించారు. నిజాం హయాంలో కట్టిన ఈ నిర్మాణాలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. అయితే నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే ప్రాజెక్ట్​ సందర్శనకు నిత్యం పర్యాటకులు తరలి వచ్చేవారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర (maharastra), కర్నాటక (karnataka) నుంచి కూడా ప్రాజెక్ట్​ అందాలు చూసేందుకు వచ్చేవారు. ప్రాజెక్ట్​ దిగువన ఉన్న సమ్మర్​ బాగ్​లో దొరికే పండ్లను తినేవారు. స్విమ్మింగ్​పూల్​ ఆహ్లాదంగా గడపడంతో పాటు, గోల్​బంగ్లా తదితర ప్రాంతాల్లో సేద తీరేవారు. పట్టించుకునే వారు లేకపోవడంతో సమ్మర్​బాగ్​లో చెట్లన్నీ ఎండిపోయాయి. స్విమ్మింగ్​పూల్​లో నీరు (swimming pool water) నింపడం లేదు. ఫౌంటేన్​ కూడా నిరుపయోగంగా మారింది.

    Nizamsagar project | పత్తాలేని బోటు షికారు

    నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ (nizamsagar project) చూడడానికి వచ్చే పర్యాటకులు గతంలో బోటులో షికారు చేసేవారు. గతంలో బోటు అందుబాటులో ఉండేది. దీంతో పర్యాటకులు (tourists) అందులో షికారు చేసి జలాశయం అందాలను తిలకించేవారు. కానీ కొన్నేళ్లుగా ఇక్కడ బోటు షికారు లేకుండా పోయింది. దీంతో పర్యాటకుల తాకిడి క్రమంగా తగ్గిపోతోంది. అధికారులు స్పందించి ప్రాజెక్ట్​ను పర్యాటక కేంద్రంగా (tourist center) మార్చి, వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

    Latest articles

    Yoga | మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు: ధన్​పాల్​

    అక్షరటుడే, ఇందూరు: Yoga | మోదీ ప్రధాని అయిన తర్వాత యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారని అర్బన్ ఎమ్మెల్యే...

    Choreographer Krishna | పోక్సో కేసు.. ఢీ డ్యాన్సర్, కొరియోగ్రాఫ‌ర్ కృష్ణ మాస్ట‌ర్ అరెస్ట్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Choreographer Krishna | తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు మళ్లీ చర్చకు తెరలేపాయి....

    Congress | కాంగ్రెస్​లో వర్గపోరు.. మంత్రి ఎదుటే గొడవకు దిగిన నాయకులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | గజ్వేల్​ నియోజకవర్గ (Gajwel Constituency) కాంగ్రెస్​ పార్టీలో వర్గపోరు నెలకొంది. మంత్రి...

    Health Camp | మెగా ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Health Camp | నగరంలోని శివాజీ నగర్ మున్నూరుకాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉచిత...

    More like this

    Yoga | మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు: ధన్​పాల్​

    అక్షరటుడే, ఇందూరు: Yoga | మోదీ ప్రధాని అయిన తర్వాత యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారని అర్బన్ ఎమ్మెల్యే...

    Choreographer Krishna | పోక్సో కేసు.. ఢీ డ్యాన్సర్, కొరియోగ్రాఫ‌ర్ కృష్ణ మాస్ట‌ర్ అరెస్ట్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Choreographer Krishna | తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు మళ్లీ చర్చకు తెరలేపాయి....

    Congress | కాంగ్రెస్​లో వర్గపోరు.. మంత్రి ఎదుటే గొడవకు దిగిన నాయకులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | గజ్వేల్​ నియోజకవర్గ (Gajwel Constituency) కాంగ్రెస్​ పార్టీలో వర్గపోరు నెలకొంది. మంత్రి...