ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMla Pocharam | నిజాంసాగర్ పటిష్టమైన ప్రాజెక్టు..: పోచారం

    Mla Pocharam | నిజాంసాగర్ పటిష్టమైన ప్రాజెక్టు..: పోచారం

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | భారీ వరదలు వచ్చినా నిజాంసాగర్​ ప్రాజెక్టు పటిష్టంగా, సురక్షితంగా ఉందని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Mla Pocharam Srinivar reddy) తెలిపారు. పోచారం, ఘన్​పూర్​ల (Ghanpur) నుంచి భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు మంజీరలోకి వదులుతుండడంతో సోమవారం నిజాంసాగర్ ప్రాజెక్టును (Nizamsagar Project) పరిశీలించారు.

    ఈ సందర్భంగా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చిన నేపథ్యంలో ప్రాజెక్టు ఇంజినీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ దేవుని దయ వల్ల ఈ సంవత్సరం కూడా నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిందన్నారు. వానాకాలం, యాసంగి పంటలకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందించవచ్చన్నారు.

    రైతులు సాగునీటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Meteorological Department) హెచ్చరికల నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మంజీరలోకి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేసే క్రమంలో నది పరీవాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. ఆయన వెంట ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, మున్సిపల్ మాజీ ఛైర్మన్​ జంగం గంగాధర్, నార్ల సురేష్, ఎజాజ్, స్థానిక నాయకులు ఉన్నారు.

    More like this

    Hyderabad | యాప్​ ద్వారా డ్రగ్స్​ విక్రయాలు.. ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో డ్రగ్స్​ దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వం కఠిన చర్యలు...

    Mallikarjuna Kharge | ఒక దేశం.. తొమ్మిది ప‌న్నులు.. జీఎస్టీపై మ‌ల్లికార్జున ఖ‌ర్గే వ్యాఖ్య‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mallikarjuna Kharge | వ‌స్తు సేవ‌ల ప‌న్ను(జీస్టీ) హేతుబద్ధీకరణ, రేటు తగ్గింపులపై కాంగ్రెస్ విభిన్నంగా...

    Madras IIT | దేశంలో టాప్ విద్యాసంస్థ‌ల జాబితా విడుద‌ల‌.. అగ్ర‌స్థానంలో మ‌ద్రాస్ ఐఐటీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Madras IIT | దేశంలో అత్యుత్త‌మ విద్యాసంస్థ‌ల జాబితాను కేంద్ర ప్ర‌భుత్వం గురువారం విడుద‌ల...