అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ (Fourth Town Station) పరిధిలో పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. పేకాడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ.21 వేల నగదు, 8 ఫోన్లు, మూడు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఓ పార్టీకి చెందిన నేత కూడా ఉన్నారు. సదరు నేత ఇంట్లోనే పేకాట స్థావరం నిర్వహించడం గమనార్హం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాలుగో టౌన్ ఎస్హెచ్వో సతీశ్ (SHO Satish) తెలిపారు.
