అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Road Safety Awareness Program | సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) సూచించారు. రోడ్డు భద్రత ప్రమాదాల నివారణపై విద్యార్థులు ఇతరులను చైతన్యవంతం చేయాలన్నారు.
రోడ్డు ప్రమాదాలు నివారించడం కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అలైవ్ అరైవ్ (Arrive Alive) కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ నగరంలోని విజయ హై స్కూల్ (Vijaya High School) విద్యార్థులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ హాజరై మాట్లాడారు. రోడ్డు ప్రమాదం అంటే ఒక కుటుంబం రోడ్డు పాలవడమని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు నిత్యం అనేకం చోటు చేసుకుంటున్నాయని తెలిపారు.
Road Safety Awareness Program | జాగ్రత్తలతో..
రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే అవగాహన, ముందస్తు జాగ్రత్తలే మార్గమని సీపీ తెలిపారు. విద్యార్థి దశ నుంచే సామాజిక అంశాల పట్లపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థులు అంబాసిడర్లుగా ఉండి తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారిని చైతన్యవంతం చేయాలని సూచించారు. క్రమశిక్షణ పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ పీస్ ఎస్హెచ్వో ప్రసాద్, ఐరాడ్ మేనేజర్ వర్షా నిహాంత్, విజయ్ హై స్కూల్ ప్రిన్సిపాల్ ప్రభాదేవి, సుజాత, వసంత పాల్గొన్నారు.
