ePaper
More
    HomeతెలంగాణNizamabad CP | శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

    Nizamabad CP | శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad CP | శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఇందల్వాయి పీఎస్‌ పరిధిలోని సిర్నాపల్లిలో(Sirnapalli) మాజీద్‌ఖాన్, అతని కుటుంబీకులపై పాత కక్షలతో తాళ్ల నవీన్, టేకుమల్ల మనోజ్, గొల్ల అశోక్, నిఖిల్, వడ్లూరి రంజిత్‌ కుమార్, రమేష్‌ కలిసి దాడి చేశారు. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ (investigation) జరిపినట్లు చెప్పారు. చర్యకు కారకులను సైతం గుర్తించి రిమాండ్‌ చేసినట్లు పేర్కొన్నారు. సమాజంలో ఉద్రిక్తతలు రేపేలా వ్యవహరిస్తే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి సమాచారం సమీపంలోని పోలీస్‌స్టేషన్, లేదా డయల్‌ 100, స్పెషల్‌ బ్రాంచ్‌ నంబర్‌ 87126–59777, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 08462–226090కు సమాచారమివ్వాలని సూచించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...