Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad CP | డిచ్​పల్లి, ధర్పల్లి పీఎస్​లను తనిఖీ చేసిన సీపీ

Nizamabad CP | డిచ్​పల్లి, ధర్పల్లి పీఎస్​లను తనిఖీ చేసిన సీపీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nizamabad CP | డిచ్​పల్లి, ధర్పల్లి పోలీస్​ స్టేషన్లను సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టేషన్​ ఆవరణలను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల (road accidents) నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గంజాయి నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు. సైబర్ మోసగాళ్ల (cyber fraudsters) బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. గేమింగ్​ యాప్​ల వల్ల ప్రజలు మోసపోకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఆయన వెంట సీఐలు మల్లేశ్​, భిక్షపతి, ఎస్సైలు షరీఫ్​, సుహాసిని, రామకృష్ణ, రాము, పోలీస్ సిబ్బంది ఉన్నారు.