Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | కారును ఢీకొన్న RTC బస్సు.. తప్పిన ప్రమాదం

Nizamabad | కారును ఢీకొన్న RTC బస్సు.. తప్పిన ప్రమాదం

Nizamabad | నగరంలోని కంఠేశ్వర్​ బైపాస్​ వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం (అక్టోబరు 16) ఉదయం ఓ కారును ఆర్టీసీ బస్సు RTC bus ఢీకొంది.

Nizamabad | లెఫ్ట్​ సైడ్​ నుంచి ఓవర్​ టేక్​ చేయబోయి..

నిజామాబాద్​ నగరంలోని కంఠేశ్వర్​ బైపాస్ (Kanteshwar Bypass)​ వద్ద ఈ ప్రమాదం జరిగింది. నిజామాబాద్​ వైపు వెళ్తున్న బస్సును ఓ కారు CAR నడుపుతున్న వ్యక్తి ఓవర్​ టేక్​ చేయబోయాడు.

అయితే, కారు డ్రైవర్​ లెఫ్ట్​ సైడ్​ నుంచి బస్సును దాటే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో బస్సును ఆర్టీసీ డ్రైవర్​ లెఫ్ట్​ సైడ్​కు మలపడంతో ఈ ప్రమాదం సంభించింది.

ఈ ఘటనలో కారు స్వల్పంగా ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తువారిలో ఎవరూ గాయపడలేదు. సమాచారం అందుకున్న ట్రాఫిక్​ కానిస్టేబుళ్లు శంకర్​, రాములు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్​ను క్లియర్​ చేశారు.