ePaper
More
    HomeతెలంగాణPashamylaram | పాశమైలారం పేలుడులో నవ దంపతుల మృతి

    Pashamylaram | పాశమైలారం పేలుడులో నవ దంపతుల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Pashamylaram | వారిద్దరు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. పేద కుటుంబాల్లో పుట్టి కష్టపడి చదువుకొని ఒకే కంపెనీలో కొలువు సాధించారు. అనంతరం మంచి మిత్రులుగా మారిన వారిలో ప్రేమ చిగురించింది. దీంతో ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొత్త జీవితాన్ని ఆనందంగా గడపాలని కలలు కన్నారు. అయితే వారి కలలను విధి కల్లలు చేసింది. పాశమైలారం(Pashamylaram)లో రియాక్టర్​ పేలిన ఘటనలో నవ దంపతులు మృతి చెందారు.

    సంగారెడ్డి జిల్లా(Sangareddy District) పాశమైలారంలోని సిగాచి కంపెనీలో సోమవారం రియాక్టర్​ పేలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందగా.. 17 మంది ఆచూకీ లభించడం లేదు. పలువురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఓ నూతన జంట చనిపోయింది.

    READ ALSO  KTR tweet | "కాంగ్రెస్ నాయకులకు పోలీస్ యూనిఫామ్ ఇవ్వండి"

    Pashamylaram | ఇటీవల ఉద్యోగంలో చేరి..

    కడప జిల్లా(Kadapa District)కు చెందిన నిఖిల్ కుమార్ రెడ్డి సిగాచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎన్టీఆర్​ జిల్లా విస్సన్నపేట(Vissannapet)కు చెందిన రమ్యశ్రీ కూడా అదే పరిశ్రమలో పనిచేస్తోంది. దీంతో వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో వారు రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఇటీవల ఉద్యోగాల్లో చేరారు. అయితే కుటుంబ సభ్యులు వారి పెళ్లిని అంగీకరించారు. ఆషాఢ మాసం అయిపోయాక ఫంక్షన్​ చేద్దామని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే రియాక్టర్​ పేలుడు(Reactor Explosion) ఘటనలో నవ దంపతులు మృతి చెందారు. దీంతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది. పోలీసులు పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...

    Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : పలు ఏరియాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...