ePaper
More
    Homeఅంతర్జాతీయంearthquake | న్యూజిలాండ్​లో వణికించిన వరుస భూకంపాలు.. ఆ దేశాల్లోనూ కంపించిన భూమి

    earthquake | న్యూజిలాండ్​లో వణికించిన వరుస భూకంపాలు.. ఆ దేశాల్లోనూ కంపించిన భూమి

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: earthquake : న్యూజిలాండ్ ను వరుస భూకంపాలు వణికించాయి. పశ్చిమ తీరంలో మొదట భారీ భూకంపం ఏర్పడింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2గా నమోదైంది. భారత స్థానిక కాలమాన ప్రకారం.. సాయంత్రం 6:46 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. ఇన్వర్ కార్గిల్​కు నైరుతి దిశలో 300 కిలోమీటర్ల దూరంలో సముద్రం అడుగున 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. ఈ భూకంప ప్రభావంతో దేశవ్యాప్తంగా భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

    మాక్వేరీ ద్వీప ప్రాంతంలో తిరిగి రాత్రి 8:23 నిమిషాల ప్రాంతంలో మరోమారు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్​ స్కేల్​పై 6.8 గా నమోదైంది. భూమికి 4.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

    READ ALSO  Earthquake | రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

    వరుసగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వరుస భూకంపాలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే సహాయక చర్యలకు ఉపక్రమించింది.

    కాగా, ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఈ ఎర్త్ క్వేక్​లను అధికారులు భారీ, భూకంపాలుగా పేర్కొన్నారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. భూకంపాలు, అగ్నిపర్వతాలు సర్వసాధారణమైన పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ జోన్​లో 5 మిలియన్ల మందికి పైగా నివస్తున్న న్యూజిలాండ్ ఉంది. ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి.

    ఆ దేశాల్లోనూ…

    అదే సమయంలో వనువాటులోని లుగాన్‌విల్లేలోనూ భూకంపం ఏర్పడింది. భారత కాలమాన ప్రకారం.. రాత్రి 7:19 గంటలకు సోలోమాన్​ దీవికి 300 కిలోమీటర్ల దూరంలో 80 కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడింది. దీని తీవ్రత రిక్టర్​ స్కేల్​పై 5.3గా నమోదైంది.

    READ ALSO  fake embassy | గుర్తింపు లేని దేశాలకు రాయబారి.. ప్రధాని, ప్రముఖులతో ఫొటోలు.. భారీ మోసానికి తెర లేపిన ఘనుడు..

    టోంగాలోనూ భూకంపం ఏర్పడింది. భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నుకువాలోఫాకు 755 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడింది. దీని తీవ్రత రిక్టర్​ స్కేల్​పై 5.4గా నమోదైంది.

    Latest articles

    BRSV | రేపు బనకచర్లపై బీఆర్​ఎస్​వీ రాష్ట్ర సదస్సు

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: BRSV | బనకచర్ల ప్రాజెక్ట్​ కారణంగా తెలంగాణ(Telangana)కు జరిగే అన్యాయంపై బీఆర్​ఎస్​వీ ఆధ్వర్యంలో రేపు...

    Central Government | 25 ఓటీటీలు, సైట్ల‌పై నిషేధం.. కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Central Government | అశ్లీష కంటెంట్‌ను ప్ర‌చారం చేస్తున్న ఓటీటీ(OTT)లు, వెబ్‌సైట్ల‌(Websites)పై కేంద్రం కొర‌డా ఝ‌ళిపించింది. 25...

    Bihar Former CM | తేజ‌స్వియాద‌వ్ ప్రాణాల‌కు ముప్పు.. బీహార్ మాజీ సీఎం ర‌బ్రీదేవి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Bihar Former CM | బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి, లాలూసింగ్ యాద‌వ్ స‌తీమ‌ణి ర‌బ్రీదేవి(Bihar Former CM...

    Junior Colleges | బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి

    అక్షర టుడే నిజాంసాగర్: Junior Colleges | విద్యార్థులు బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఇంటర్​...

    More like this

    BRSV | రేపు బనకచర్లపై బీఆర్​ఎస్​వీ రాష్ట్ర సదస్సు

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: BRSV | బనకచర్ల ప్రాజెక్ట్​ కారణంగా తెలంగాణ(Telangana)కు జరిగే అన్యాయంపై బీఆర్​ఎస్​వీ ఆధ్వర్యంలో రేపు...

    Central Government | 25 ఓటీటీలు, సైట్ల‌పై నిషేధం.. కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Central Government | అశ్లీష కంటెంట్‌ను ప్ర‌చారం చేస్తున్న ఓటీటీ(OTT)లు, వెబ్‌సైట్ల‌(Websites)పై కేంద్రం కొర‌డా ఝ‌ళిపించింది. 25...

    Bihar Former CM | తేజ‌స్వియాద‌వ్ ప్రాణాల‌కు ముప్పు.. బీహార్ మాజీ సీఎం ర‌బ్రీదేవి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Bihar Former CM | బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి, లాలూసింగ్ యాద‌వ్ స‌తీమ‌ణి ర‌బ్రీదేవి(Bihar Former CM...