CP Sai chaitanya
CP Sai chaitanya | సీపీని కలిసిన నూతన ఎస్సైలు

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai chaitanya | పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో నియమితులైన ఎస్సైలు మంగళవారం సీపీ సాయిచైతన్యను కలిశారు. కమిషనరేట్ కార్యాలయంలో(Commissionerate Office) మంగళవారం సీపీని కలిసి పూలమొక్కలను అందజేశారు.

CP Sai chaitanya | విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండాలి..

అనంతరం పోలీస్​ కమిషనర్ సాయిచైతన్య మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా నిక్కచ్చిగా వ్యవహరించాలన్నారు. తాము పనిచేస్తున్న పోలీస్ స్టేషన్​ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. సీపీని కలిసిన వారిలో మోపాల్ ఎస్సై సుస్మిత, ధర్పల్లి ఎస్సై కళ్యాణి, ఎడపల్లి ఎస్సై రమ, బాల్కొండ ఎస్సై శైలేందర్, మెండోరా ఎస్సై సుహాసిని, ఎరుగట్ల ఎస్సై రాజేశ్వర్, మూడో టౌన్ ఎస్సై కిరణ్ పాల్ ఉన్నారు.