Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం.. 125 మంది జీపీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కామారెడ్డి కలెక్టర్​ (Kamareddy Collector) కొరడా ఝులిపించారు. ఏకంగా 125 మంది పంచాయతీ కార్యదర్శులకు (panchayat secretaries) షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. Indiramma Housing Scheme | ఆది నుంచి ఇళ్ల నిర్మాణాలపై నిర్లక్ష్యం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఎప్పటికప్పుడు అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు అదేశాలు జారీ చేస్తూనే […]

అక్షరటుడే, కామారెడ్డి: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కామారెడ్డి కలెక్టర్​ (Kamareddy Collector) కొరడా ఝులిపించారు. ఏకంగా 125 మంది పంచాయతీ కార్యదర్శులకు (panchayat secretaries) షోకాజ్​ నోటీసులు జారీ చేశారు.

Indiramma Housing Scheme | ఆది నుంచి ఇళ్ల నిర్మాణాలపై నిర్లక్ష్యం..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఎప్పటికప్పుడు అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు అదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినా అనుకున్న స్థాయిలో పనుల్లో పురోగతి కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో పర్యటనలకు వెళ్లినప్పుడు ఈ విషయాన్ని గుర్తించిన కలెక్టర్ చర్యలకు పూనుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కనీస మార్కింగ్ చేయడంలో విఫలమైన 125 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Indiramma Housing Scheme | ఆలస్యంగా వెలుగులోకి..

జిల్లాలోని 125 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ప్రతి మండలంలో ఇందిరమ్మ నిర్మాణాలు మార్కింగ్ చేయకుండా ఐదుగురు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ జారీ చేశారు. ఈనెల 15న షోకాజ్ నోటీసులు జారీ చేసినా ఎక్కడ కూడా ఈ విషయం బయటకు పొక్కలేదు. ఈ విషయమై పలువురు పంచాయతీ కార్యదర్శులకు ఫోన్​చేసి వివరణ కోరగా షోకాజ్ నోటీసులు వచ్చిన విషయం నిజమేనన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో (Indiramma house constructions) బాటమ్​లో ఉన్న మండలాలకు చెందిన కార్యదర్శులందరికీ నోటీసులు వచ్చాయన్నారు.

లబ్ధిదారులు ముందుకు రావడం లేదు : మహేష్, పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షుడు

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు సమయంలో ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో మంజూరైన లబ్ధిదారులు ఇల్లు కట్టుకుంటామన్నారని పంచాయతీ కార్యదర్శుల యూనియన్​ జిల్లా అధ్యక్షుడు మహేష్​ తెలిపారు.

తీరా ఇప్పుడు పెట్టుబడి మొదట పెట్టి ఇల్లు కట్టుకోవడానికి ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. తమకు ఇల్లు అవసరం లేదని రాసిస్తామంటున్నారని తెలిపారు.

గ్రామస్థులేమో కట్టుకుంటామని ముందుకొచ్చిన వారికి మంజూరు ఇవ్వాలని చెబుతున్నారన్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు చెబితే.. ముందు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నారని వాపోయారు. లబ్ధిదారులకు ఎంత చెప్పినా వినడం లేదని, వాళ్ళు ఇల్లు కట్టుకోకపోతే తామేమి చేస్తామని మహేష్​ వాపోయారు.

Related articles

Maoist Movement End Phase | ముగిసిన మావోయిస్టుల ఉద్యమ ప్రస్థానం!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Movement End Phase | ఒకప్పుడు దేశంలోని పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలు నడిపిన మావోయిస్టు పార్టీ ఉద్యమ...

Balakrishna House Car Accident | బాలకృష్ణ ఇంటి వద్ద కారు బీభత్సం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balakrishna House Car Accident | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా ప్రయాణిస్తున్న కారు...

Modi Launches Namo Bharat | తొలి హైస్పీడ్​ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Launches Namo Bharat | ఉత్తర ప్రదేశ్​లోని మీరట్​లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం...

Eco Run 2.0: మాదాపూర్‌లో మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0 సందడి.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 4,200 మంది పరుగు

హైదరాబాద్: ఐటీ హబ్ మాధాపూర్‌లో ఆదివారం ఉదయం పరుగు ఉత్సాహం ఉప్పొంగింది. మైండ్‌స్పేస్ REIT, మిర్చి సంయుక్తంగా నిర్వహించిన మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0...