అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: National Lok Adalat | జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీపీ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈనెల 13న జరిగే చాలామంది ప్రజల న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన తక్కువ ఖర్చుతో పరిష్కరించడానికి నిర్వహిస్తున్న లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చిన్నచిన్న కేసులు, ట్రాఫిక్ చలాన్లు (Traffic challans), మైనర్ క్రిమినల్ కేసులు(Minor criminal cases), సివిల్ తగాదాలను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను తక్కువ సమయంలో ముగించుకోవచ్చన్నారు.
అంతేకాకుండా లోక్ అదాలత్ అనేది ఒక శాంతియుత పరిష్కార విధానమని పేర్కొన్నారు. పరస్పర అంగీకారంతో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. కోర్టు కేసుల్లో త్వరగా పరిష్కారం చేసుకుని అవకాశం దొరుకుతుందన్నారు.