- Advertisement -
Homeతాజావార్తలుGovernment Medical College | జాతీయ స్థాయిలో ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల ప్రతిభ

Government Medical College | జాతీయ స్థాయిలో ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల ప్రతిభ

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Government Medical College | నిజామాబాద్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు జాతీయస్థాయిలో (National Level) తమ ప్రతిభ చాటారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థులు (MBBS Students) బోయిండల సూర్య, శశాంత్ కుమార్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎంఐడీ–డర్మకాన్​2025లో పాల్గొన్నారు.

అక్కడ నిర్వహించిన డీవీఎల్​–యూజీ డెర్మటాలజీ క్విజ్​లో (DVL–UG Dermatology Quiz)​ వీరు రెండోస్థానం సాధించారు. ఈ క్విజ్‌కి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలు ఆగస్టు నెలలో ఆన్‌లైన్‌లో నిర్వహించగా, దేశవ్యాప్తంగా 100కి పైగా బృందాలు పాల్గొన్నాయి.

- Advertisement -

వాటిలో నుంచి 5 బృందాలు మాత్రమే జాతీయ ఫైనల్స్‌కు ఎంపికయ్యాయి. అందులో నిజామాబాద్ మెడికల్ కాలేజ్‌ విద్యార్థులు (Nizamabad Medical College Students) మెరుగైన ప్రదర్శన కనబర్చి రెండో స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా జీజీహెచ్​ సూపరింటెండెంట్​ శ్రీనివాస్​, ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపాల్​, అడిషనల్​ డీఎంఈ ఎన్. కృష్ణ మోహన్​, కళాశాల డెర్మటాలజీ డిపార్ట్​మెంట్​ హెచ్​వోడీ రామ్మోహన్​ తదితరులు విద్యార్థులను అభినందించారు. జాతీయ స్థాయిలో జిల్లా మెడికల్​ కళాశాల పేరును నిలబెట్టారని ప్రశంసించారు.

 

 

 

- Advertisement -
- Advertisement -
Must Read
Related News