ACB | ఏసీబీకి చిక్కిన నాగిరెడ్డిపేట తహశీల్దార్​

అక్షరటుడే, లింగంపేట : ACB | కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం (Nagireddypet mandal) తహశీల్దార్ యార్లగడ్డ శ్రీనివాస్ రావు ఏసీబీకి చిక్కారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ వ్యక్తి వ్యవసాయ భూమిని తన పేరున బదిలీ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. కాగా.. బదిలీ చేయాలంటే డబ్బులు ఇవ్వాలని తహశీల్దార్​ (Tahsildar) డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడి ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం […]

అక్షరటుడే, లింగంపేట : ACB | కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం (Nagireddypet mandal) తహశీల్దార్ యార్లగడ్డ శ్రీనివాస్ రావు ఏసీబీకి చిక్కారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు.

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ వ్యక్తి వ్యవసాయ భూమిని తన పేరున బదిలీ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. కాగా.. బదిలీ చేయాలంటే డబ్బులు ఇవ్వాలని తహశీల్దార్​ (Tahsildar) డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడి ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం రూ. 50వేల లంచం డబ్బులు అజయ్​ అనే ప్రైవేటు వ్యక్తి తీసుకుంటుండగా అనిశా అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం తహశీల్దార్​ శ్రీనివాస్​ రావు, ప్రైవేటు వ్యక్తి అజయ్​లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని హైదరాబాద్​లోని ఏసీబీ కోర్టుకు తరలించారు.

ACB | లంచం అడిగితే ఫిర్యాదు చేయండి..

ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్‌ 1064ను సంప్రదించాలని పేర్కొన్నారు. అలాగే ఏసీబీ తెలంగాణ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు whatsapp (9440446106), facebook (Telangana ACB), X/గతంలో ట్విట్టర్ (@Telangana ACB) ద్వారా కూడా సంప్రదించవచ్చన్నారు.

Related articles

Hyderabad Cyber Crime Arrests | 104 మంది సైబర్​ నేరగాళ్ల అరెస్ట్​.. నిందితుల్లో బ్యాంకు ఉద్యోగులు

హైదరాబాద్ సైబర్​ క్రైమ్​​ పోలీసులు భారీ ఆపరేషన్​ చేపట్టారు. 104 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

Influencer Labor Controversy | భార్య ప్రసవ వేదనను వీడియోగా.. మధ్యలో యాడ్ ప్రమోషన్ .. పిచ్చి పీక్స్‌కి చేరిందేంటి..!

సియాటెల్‌లో నివసిస్తున్న చైనాకు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ ‘పాల్ ఇన్ యూఎస్ఏ’ తన భార్య 23 గంటల ప్రసవ వేదనను వీడియోగా పోస్ట్ చేసి, అదే వీడియోలో పెయిడ్ యాడ్ చదివిన ఘటన తీవ్ర వివాదానికి దారి తీసింది. ప్రజాగ్రహం మధ్య డౌయిన్, వీబో అతడి ఖాతాలను నిషేధించాయి.

Hyderabad Family Suicide | హైదరాబాద్​లో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

హైదరాబాద్​లోని అంబర్​పేటలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.

Rythu Bharosa Delay | రైతు భరోసా లేనట్లేనా.. ఆందోళనలో అన్నదాతలు

యాసంగి సీజన్​కు సంబంధించి రైతు భరోసాను ప్రభుత్వం ఇంకా జమ చేయలేదు. రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు.