ePaper
More
    HomeజాతీయంMysore Bharath | మైసూర్‘పాక్‌’ వద్దు.. మైసూర్​‘భారత్​’ ముద్దు.. ‘పాక్’ను తొలగించాలంటున్న నెటిజన్లు..!

    Mysore Bharath | మైసూర్‘పాక్‌’ వద్దు.. మైసూర్​‘భారత్​’ ముద్దు.. ‘పాక్’ను తొలగించాలంటున్న నెటిజన్లు..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Mysore Bharath | ప‌హ‌ల్​గామ్​లో 26 మంది టూరిస్ట్‌ల‌పై ఉగ్ర‌దాడులు (Terrorist attacks) మ‌తం పేరు క‌నుక్కొని మ‌రీ దాడి చేయ‌డం సంచ‌ల‌నం రేపింది. దీనికి ప్ర‌తీకారంగా భార‌త సైన్యం ఆప‌రేష‌న్ సిందూర్(Operation Sindoor) చేపట్టింది. వంద‌మంది ఉగ్ర‌దాడుల‌ని వేరేసిన‌ట్టు స‌మాచారం. అయితే భార‌త్ దాడి చేసిన కార‌ణంగా పాకిస్తాన్ సైన్యం కూడా మ‌న‌మీద దాడుల‌కి దిగింది. అన్నింటిని భార‌త్ Indiaతిప్పి కొట్టింది. ఇక మే 10న భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ఆగింది. కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయి. అయితే పాకిస్తాన్‌కు చెందిన మూడు యుద్ధ విమానాలును భారత్ కూల్చివేసింది. పాకిస్తాన్ ఫైటర్ జెట్ F-16తో పాటు రెండు JF-17 యుద్ధ విమానాలను కూల్చేసింది.

    10 పాక్‌ డ్రోన్లను S400తో పేల్చేసింది. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌(Pathankot Airbase)ను కూడా పాక్‌ టార్గెట్ చేసింది. మిసైల్స్, డ్రోన్లను మధ్యలోనే భారత్ నిర్వీర్యం చేసింది. యాంటీ మిస్సైల్ సిస్టమ్‌కి దొరక్కుండా.. పాకిస్తాన్ డ్రోన్లు ప్రయోగిస్తోంది. యాంటీడ్రోన్‌ సిస్టమ్‌తో పాక్‌ డ్రోన్లను కూల్చివేశారు. సాంబా సెక్టార్‌లోనూ పాక్‌ దాడులకు తెగబడ‌గా, పాక్‌ దాడులను భారత్‌ సమర్థవంతంగా తిప్పికొట్టింది. యుద్ధ India-Pakistan War నేపథ్యంలో ప్రజల్లోనూ భావోద్వేగాలు పెరిగాయి. హైదరాబాద్​లో కరాచీ బేకరీ Karachi Bakery చాలా పాపులర్. యుద్ధం నేపథ్యంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పదేప‌దే క‌రాచీ బేక‌రీపై దాడి చేశారు.

    అందుకు కార‌ణం పేరులో క‌రాచీ(Karachi) ఉండ‌డ‌మే. పాకిస్తాన్​లోని కరాచీ అనే పేరుతో హైదరాబాద్​ Hyderabad లో బేకరీకి కరాచీ అనే పేరుండకూడదని బీజేపీ నేతలు ర‌చ్చ చేశారు. ఇక పాక్‌కి స‌పోర్ట్ ఇచ్చిన ట‌ర్కీ , చైనాల‌కి సంబంధించిన ప‌లు వ‌స్తువుల‌ను బ్యాన్ చేయాల‌ని సెల‌బ్రిటీలు పిలుపునిచ్చారు. సోష‌ల్ మీడియాలో పాక్, చైనా, ట‌ర్కీల‌ని పూర్తిగా బ్యాన్ చేయాల‌ని అంటున్నారు.

    ఇక ఇదే క్ర‌మంలో మైసూర్ పాక్‌లో పాక్ తీసేసి మైసూర్ భారత్(Mysore Bharath) అని పెట్టాల‌ని కొత్త డిమాండ్ మొద‌లైంది. పాక్ అనే పేరు మ‌న దేశంలో విన‌ప‌డ‌కూడదు అంటూ కొంద‌రు నెటిజ‌న్స్ డిమాండ్ చేస్తున్నారు. మైసూర్​పాక్​ను ఎంతో ఇష్టపడుతుంటారు. ఒక్కప్పుడు ప్రతి ఫంక్షన్​లో ఇదే స్విట్​ వడ్డించేవారంటే ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తుంది. మైసూర్ పాక్ అనేది ప్రత్యేకమైన భారతీయ తీపి వంటకం. దీనికి ఎంతో విశిష్టత ఉంది. దీనిని ప్రధానంగా శనగపిండి, నెయ్యి, పంచదారతో తయారు చేస్తారు. చాలా మంది మైసూర్​ పాక్​ను లొట్టలేసుకుంటూ తింటుంటారు. ఏది ఏమైనప్పటికీ మైసూర్​పాక్​లో పాక్​ తీసేయాలంటూ డిమాండ్​ రావడం.. కాస్త ఫ‌న్నీగా ఉన్నా కూడా భార‌తీయుల‌లో భావోద్వేగాలు ఎంత ఉప్పొంగుతున్నాయో అర్ధ‌మ‌వుతుంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...