HomeUncategorizedPlane Crash | ‘విమాన ప్రమాదం తర్వాత నా తల్లి, కుమార్తె కనిపించడం లేదు’

Plane Crash | ‘విమాన ప్రమాదం తర్వాత నా తల్లి, కుమార్తె కనిపించడం లేదు’

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Plane Crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాలకు దు:ఖాన్ని మిగిల్చింది. విమానం కూలిపోయిన ఘటనలో ప్రయాణికులు(Passengers), విమాన సిబ్బంది(flight Staff) 241 మంది మరణించారు. విమానంలోని ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే విమానం బీజే మెడికల్​ కాలేజీ హాస్టల్​(BJ Medical College Hostel)పై పడడంతో పలువురు వైద్య కాలేజీ విద్యార్థులు చనిపోయారు. 24 మంది మెడికోలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటన తర్వాత తన తల్లి, కుమార్తె కనిపించడం లేదని హాస్టల్​లో పని చేసే వ్యక్తి చెప్పాడు.

ఠాకూర్​ రవి అనే వ్యక్తి బీజే మెడికల్​ కాలేజీ యూజీ మెస్​(UG Mess)లో పని చేస్తాడు. కుటుంబంతో సహా అక్కడే ఉంటారు. ఈ క్రమంలో విద్యార్థులకు వంట చేసిన ఆయన డాక్టర్ల కోసం టిఫిన్​ బాక్సులు(Doctors Tiffin boxes) తీసుకొని సివిల్​ హాస్పిటల్​ వెళ్లాడు. ఆ సమయంలోనే విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అప్పటి నుంచి తన తల్లి సరళాబెన్​ ప్రహ్లాదీ ఠాకూర్​, తన కుమార్తె ఆద్యారవి ఠాకూర్ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మెస్​, హాస్పిటల్​ పరిసరాల్లో వెతికినా ఇంత వరకు ఆచూకీ దొరకలేదని వాపోయాడు.

Must Read
Related News